

ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో భారీగా కోత విధించింది. పెరుగుతున్న ఇంధన ధరలు, ప్రపంచ ఉద్రిక్తతలు మరియు గగనతల ఆంక్షల కారణంగా జూన్ నుంచి ఆగస్టు వరకు పలు మార్గాల్లో విమానాలను తగ్గించడంతో పాటు కొన్ని సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది.
ఢిల్లీ–చికాగో విమానాలను రద్దు చేయగా, ఢిల్లీ–శాన్ ఫ్రాన్సిస్కో, ఢిల్లీ–పారిస్, సింగపూర్, బ్యాంకాక్ మరియు ఇతర యూరోపియన్ మార్గాల్లో సర్వీసులు గణనీయంగా తగ్గించారు. ఢిల్లీ–షాంఘై మరియు చెన్నై–సింగపూర్ మార్గాల్లో విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. కొన్ని ఆసియా మార్గాల్లో కూడా ఫ్రీక్వెన్సీ తగ్గించారు.
నెట్వర్క్ స్థిరత్వం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు సమాచారం ఇచ్చి రీషెడ్యూలింగ్ లేదా పూర్తి రిఫండ్ అందిస్తామని పేర్కొంది. ప్రయాణికులు ముందుగా ఫ్లైట్ స్టేటస్ చెక్ చేయాలని సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!