

తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనాన్ని భక్తులకు వేగంగా, సౌకర్యవంతంగా అందించేందుకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను సమర్థవంతంగా వినియోగిస్తోంది. వేసవి సెలవుల నేపథ్యంలో భారీగా పెరిగిన భక్తుల రద్దీని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ క్యూ లైన్లు, భక్తుల కదలికలు, ఆలయ పరిసరాలను డిజిటల్గా నియంత్రిస్తోంది. అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమిస్తూ తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సేవలను వేగంగా అందిస్తోంది.
నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలో క్యూ లైన్లను సమతుల్యం చేస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాన్ని సాఫీగా కొనసాగిస్తోంది. ఈ సాంకేతిక విధానాల వల్ల దర్శన సమయం గణనీయంగా తగ్గింది. సాధారణ రోజుల్లో 75 వేల మందికి పైగా, పండుగ రోజుల్లో 85 వేల మందికి పైగా భక్తులు దర్శనం పొందుతుండగా, ఈ నెల 2న రికార్డు స్థాయిలో 91,005 మంది స్వామివారిని దర్శించుకున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!