
జనరల్

నిన్న జరిగిన ప్రెస్ మీట్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల కష్టాలపై మాట్లాడటం వాస్తవానికి దూరంగా అనిపించిందని నిర్మాత నాగవంశీ వ్యాఖ్యానించారు. ఎగ్జిబిటర్ ఎంత ముఖ్యమో, డిస్ట్రిబ్యూటర్ కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. ఒక వర్గాన్ని కాపాడుతూ మరో వర్గాన్ని బలహీనపరచడం సరైన విధానం కాదని తెలిపారు.
మైత్రీ రవి మాట్లాడుతూ పరిశ్రమలో ఎవ్వరూ పూర్తిగా సంతోషంగా లేరని అన్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసి చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఇవి రాత్రికి రాత్రే పరిష్కారమయ్యే సమస్యలు కావని, అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!