
సినిమాలు

అభిషేక్ బెనర్జీ పశ్చిమ బెంగాల్లోని ఖేజూరి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగి డజన్ల కొద్దీ దుకాణాలు దగ్ధమైన ఘటనపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతర ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగిన ఈ ఘటనకు “బీజేపీ మద్దతుదారులైన దుండగులే కారణం” అంటూ ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్లో ఆరోపించారు.
హిందూ, ముస్లిం వ్యాపారులకు చెందిన 60కి పైగా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయని అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు. ఇది బెంగాల్ సామాజిక సామరస్యంపై, సాధారణ ప్రజలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇదే బీజేపీ రాజకీయాల అసలు ముఖమని విమర్శిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే స్థానిక పోలీసుల ప్రాథమిక నివేదికలు, స్థానిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!