

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత టి. హరీశ్రావు మంత్రి జూపల్లి కృష్ణారావు తీరు పూటకో సవాల్, రోజుకో చిరునామాలా మారుతోందని తీవ్రంగా విమర్శించారు. సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన, జూపల్లి సవాళ్లు నిలబెట్టుకోలేక మాట మార్చారని ఆరోపించారు. తెలంగాణ భవన్కు వస్తానని చెప్పి, తర్వాత గన్పార్క్కు వెళ్లారని, అక్కడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు.
ఇక అప్పుల అంశంపై కూడా హరీశ్రావు స్పందిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై జూపల్లి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1.77 లక్షల కోట్లు అప్పు చేశామని మంత్రి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు నుంచి తీసుకున్న ఆర్థిక బాధ్యతల పరిమితి చట్టం కింద అప్పుల విషయంలో తేడాలు చూపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రూ.1.86 లక్షల కోట్లు అప్పు చేసిందని పేర్కొంటూ, నిజాలను దాచేందుకు నష్టం నియంత్రణ చర్యలు చేపడుతున్నారని విమర్శించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!