

ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు ప్రశ్న రావణ్, కేవీఆర్ అరెస్టులను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కడం ప్రజాస్వామ్యానికి విఘాతమని పేర్కొంటూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇది ఫాసిజం, పిరికితనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రశ్నించే వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యమా అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. గత తరాలు కూడా ఇలాగే గొంతులు నొక్కి ఉంటే ఈరోజు ప్రజాస్వామ్యం ఉండేదా అని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నవారు విమర్శలకు సమాధానం చెప్పాల్సిందే తప్ప అరెస్టులు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు.
ఏలూరులో జరిగిన సభలో చేసిన వ్యాఖ్యల కేసులో ప్రశ్న రావణ్ను పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి నారా లోకేశ్పై వ్యాఖ్యల నేపథ్యంలో కేవీఆర్ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. అలాగే అడ్వకేట్ జడ శ్రవణ్ కుమార్పై కూడా కేసు నమోదైంది. ఈ అరెస్టులు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!