

మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతల బృందం రాష్ట్ర సీఈఓ సుదర్శన్ రెడ్డిని కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియపై వినతి పత్రం సమర్పించింది. ఓటర్ల ధృవీకరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారులను కోరారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బలమురి వెంకట్, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
సీఈఓను కలిసిన అనంతరం బీఆర్కే భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ ఎంపీలు, ముఖ్యంగా కిషన్ రెడ్డి దొంగ ఓట్లతో గెలిచారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలైన ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా సుమారు 5.90 లక్షల ఓట్లు తొలగించబడ్డాయని పేర్కొన్నారు. ఈ ప్రక్రియతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయని, సెక్యులర్ ఓట్ల తొలగింపుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు కనీసం మూడు సార్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని, విదేశాల్లో ఉన్న ఓటర్ల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. మైనర్ మరియు పేద ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!