

ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ (సవరణ) బిల్లు-2026ను క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే భారత్పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు. బిల్లు ఆమోదమైతే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు భారత్ను వీడే అవకాశం ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని పాల్ పేర్కొన్నారు. అయితే ఇవి పాల్ చేసిన హెచ్చరికలు మాత్రమేనని, ఈ బిల్లు కారణంగా భారత్ను వీడనున్నట్లు గూగుల్ లేదా మైక్రోసాఫ్ట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ బిల్లును మార్చి 25, 2026న లోక్సభలో ప్రవేశపెట్టారు.
ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దు, సరెండర్ లేదా ముగిసిన సందర్భాల్లో సంస్థల విదేశీ నిధులు, వాటితో సృష్టించిన ఆస్తుల పర్యవేక్షణ, నిర్వహణ, బదలాయింపునకు ఈ బిల్లు కొత్త విధానాన్ని ప్రతిపాదిస్తోంది. ఇందుకోసం డిజిగ్నేటెడ్ అథారిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆగస్టు 13న బిల్లును 31 మంది సభ్యులతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!