
రాజకీయాలు

తనను కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్షను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. చీరాలకు చెందిన పుష్పావతి అనే వృద్ధురాలు సీఎంతో కలిసి ఫోటో దిగాలని కోరుకుంటున్నట్లు వ్యక్తం చేయగా, ఈ విషయం సీఎం దృష్టికి వచ్చింది. దీంతో చీరాలలోనే ఆమెను కలుస్తానని చంద్రబాబు తెలిపారు.
అనంతరం చీరాలలో పుష్పావతిని ఆప్యాయంగా కలిసిన సీఎం చంద్రబాబు ఆమెతో మాట్లాడి ఫోటో దిగారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన చేనేత కుటుంబం నాగేశ్వరరావు, లక్ష్మీ దంపతులను కూడా కలిశారు. మగ్గంతో వస్త్రంపై తన చిత్రపటాన్ని అద్భుతంగా నేసిన ఈ దంపతుల నైపుణ్యాన్ని సీఎం ప్రశంసించి అభినందనలు తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!