ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్లను ప్రేక్షకులకు అందిస్తోంది ఇండియాలోని టాప్ ఓటీటీ ఫ్లాట్ఫామ్స్లో ఒకటైన జీ5. ఈ లిస్టులో త్వరలోనే ఓ తెలుగు సిరీస్ చేరనుంది. అదే.. ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు’. అక్టోబర్ 31 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. రెక్కీ, విరాటపాలెం, పీసీ మీనా రిపోర్టింగ్ వంటి సక్సెస్ఫుల్ సిరీస్లను అందించిన సౌత్ ఇండియన్ స్క్రీన్స్ దీన్ని రూపొందిస్తోంది. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు.
టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఇందులో ప్రసాద రావుగా నటించారు. ఉదయ భాను ముఖ్య పాత్రను పోషించింది. ఇక ఓటీటీ రైజింగ్ స్టార్స్ అయిన వసంతిక ఇందులో స్వాతి పాత్రలో నటించింది. ఈ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్లో తండ్రైన రాజీవ్ కనకాల తన కూతురు స్వాతి కనిపించటం లేదని వెతుకుతుంటాడు. తండ్రికి ఏం చేయాలో తెలియక అన్వేషణ చేస్తుంటాడు. ఈ క్రమంలో నిజానికి దగ్గరయ్యే కొద్ది తనకు తెలిసే రహస్యాలు.. మోసాలు.. వెనుక దాగిన ఊహించని నిజాలు ఏంటి? ప్రేమ, కోల్పోయినప్పుడు ఉండే వెలితి, మోసం మధ్య ఉండే సన్నని సరిహద్దులు కనిపించకుండా పోతాయి. బాధ, భావోద్వేగం కలగలిసిన ఈ ప్రయాణం ప్రేక్షకులను మెప్పించనుంది.
కామెంట్స్ (2)
something is suspicious
రాజీవ్ కనకాల గారి నటనతో మరో ఎమోషనల్ జర్నీ రాబోతోంది