

జీ5 కిడ్స్ యూనివర్స్లో ఒరిజినల్ యానిమేటెడ్ పౌరాణిక సిరీస్ ‘శివలోక్ కె కుండక్క మండక్క’ (ఎస్కేఎం) ప్రారంభమైంది. ప్రముఖ రచయిత ఆనంద్ నీలకంఠన్ రాసిన పిల్లల పుస్తకం ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ జూలై 17 నుంచి ప్రసారం కానుంది. కుండక్క, మండక్క అనే అల్లరి అసుర జంట చుట్టూ తిరిగే ఈ కథ, ధైర్యం, స్నేహం, స్వీయ అవగాహన వంటి విలువలను వినోదాత్మకంగా పరిచయం చేస్తుంది. రామాయణం, మహాభారతం వంటి తెలిసిన కథలకు మాత్రమే కాకుండా, కొత్త పాత్రలు, కొత్త లోకాలతో పిల్లలకు కొత్త అనుభవాన్ని అందించనుంది.
హాస్యం, యాక్షన్, ఆకర్షణీయమైన యానిమేషన్ కలయికతో రూపొందిన ఈ సిరీస్, కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఉంటుంది. హీరో అంటే తన నిర్ణయాలతో నిలిచే వ్యక్తి అనే భావనను అందంగా చూపిస్తుంది. జీ5 కిడ్స్ ద్వారా భారతీయ సంస్కృతిని ఆధునిక కథనాలతో కలిపి పిల్లలకు సురక్షితమైన వినోదాన్ని అందించాలన్నదే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!