
రాజకీయాలు

ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీగా చేరుకున్న భక్తుల రద్దీ కారణంగా రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 100 మందికిపైగా భక్తులు గాయపడ్డారు. గర్భగుడి నుంచి రథాలవైపు దేవతామూర్తులను తీసుకువస్తున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఊపిరాడక పలువురు భక్తులు ఉక్కిరిబిక్కిరయ్యారు.
పరిస్థితి విషమించడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అత్యవసర సహాయక బృందాలు గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నాయి. గతేడాది కూడా గుండిచా ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా, 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!