
రాజకీయాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను పెంచే చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఉన్న 33 మంది జడ్జీల సంఖ్యను 37కు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ సవరణ 1956లో అమల్లోకి వచ్చిన సుప్రీంకోర్టు చట్టంలో మార్పులు చేస్తూ తీసుకురానున్నారు. న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
ఈనెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చ జరగనుంది. న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ మార్పులు ఉపయోగపడతాయని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. జడ్జీల సంఖ్య పెంపుతో కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!