
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ముఖ్య పోర్టుల అభివృద్ధికి భూసేకరణకు సంబంధించిన తాజా ఉత్తర్వులను జారీ చేసింది. రెండో దశలో భాగంగా మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల కోసం మొత్తం 6,248.54 ఎకరాల భూమిని సేకరించేందుకు నిర్ణయం తీసుకుంది.
ఈ భూసేకరణకు రూ.1,638.52 కోట్ల పరిపాలనా అనుమతి ఇవ్వబడింది. ఇందులో మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు 1,903.39 ఎకరాలు, మచిలీపట్నం పోర్టుకు 1,420.70 ఎకరాలు, రామాయపట్నం పోర్టుకు 2,924.45 ఎకరాలు కేటాయించడం ద్వారా రాష్ట్రంలో పోర్టు ఆధారిత అభివృద్ధికి పెద్ద ఊతం లభించనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!