
న్యూస్

ఈ నెల 15 వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయని సంబంధిత కమిటీ వెల్లడించింది. యాత్రకు సంబంధించిన పెద్ద స్థాయి నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా వయోపరిమితులు కూడా విధించారు. 13 సంవత్సరాల లోపు వారు, 70 సంవత్సరాల పైబడిన వారు యాత్రకు అర్హులు కాదని స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానాల్లో అందుబాటులో ఉంచారు. ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ ద్వారా, ఆఫ్లైన్లో ఎంపిక చేసిన బ్యాంకు శాఖల ద్వారా నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.220 గా నిర్ణయించారు. దరఖాస్తుతో పాటు వైద్య ధృవీకరణ పత్రం, గుర్తింపు పత్రం, పాస్పోర్ట్ సైజు ఫోటో తప్పనిసరిగా సమర్పించాలి.





















.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!