

ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో బలమైన ప్రదర్శన కనబరిచింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 8,718 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 12.22 శాతం పెరిగింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి గానూ కంపెనీ రూ. 49,210 కోట్ల నికర లాభాన్ని సాధించింది.
ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 9.64 శాతం వృద్ధితో రూ. 70,698 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 2.67 లక్షల కోట్లుగా నమోదైంది. షేర్హోల్డర్లకు ఒక్కో షేరుకు రూ. 81 డివిడెండ్ను ప్రకటించింది. అలాగే AI ఆధారిత సేవల ద్వారా వార్షిక ఆదాయం 2.3 బిలియన్ డాలర్లను దాటినట్లు కంపెనీ సీఈఓ కృతివాసన్ తెలిపారు. ఈ త్రైమాసికంలో 2,000 మందికి పైగా ఉద్యోగులు కొత్తగా చేరడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,84,519 కి చేరింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!