

పశ్చిమాసియాలో యుద్ధం నాలుగో రోజుకు చేరుకున్న నేపథ్యంలో దాడులు మరింత ఉద్ధృతమయ్యాయి. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో టెహ్రాన్లోని అధ్యక్ష భవనం, అణు కేంద్రాలు లక్ష్యంగా మారాయి. దక్షిణ లెబనాన్లో హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపి, భూతల దళాలను ప్రవేశపెట్టింది. ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, దౌత్య కార్యాలయాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. యుద్ధంలో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇరాన్, లెబనాన్లో వందలాది ప్రాణనష్టం సంభవించగా, అమెరికా సైనికులూ మరణించారు. పరిస్థితి విషమించడంతో ప్రాంతీయ విమానాశ్రయాలు మూతపడి, అనేక దేశాలు తమ పౌరులను ఖాళీ చేస్తున్నాయి.
హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళన కలిగించింది. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో అనేక చమురు నౌకలు నిలిచిపోయాయి. సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్ ప్రాంతాల్లో ఇంధన, డేటా కేంద్రాలపై దాడులు జరిగినట్లు సమాచారం. హెజ్బొల్లా బహిరంగ యుద్ధానికి సిద్ధమని ప్రకటించగా, ఇజ్రాయెల్ వైమానిక దాడులను మరింత పెంచింది. బ్రిటన్, ఫ్రాన్స్ తమ యుద్ధనౌకలను పంపించగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్తో చర్చలు జరుపుతానని తెలిపినట్లు సమాచారం. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీస్తున్నాయి.



.webp&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!