

తమిళ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన రాబోయే చిత్రాలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఖైదీ , విక్రమ్ , లియో వంటి చిత్రాల ద్వారా ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్ను నిర్మించిన లోకేష్ తదుపరి ప్రాజెక్టులపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం కూలీ చిత్రంపై దృష్టి సారించిన ఆయన, సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఆ తర్వాత ఏ సినిమా ప్రారంభిస్తారన్న విషయంలో ఇంకా స్పష్టత లేకపోవడంతో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఖైదీ 2, విక్రమ్ 2, లియో 2 చిత్రాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తో యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు లోకేష్ వెల్లడించారు. అదే సమయంలో బెంజ్ ప్రాజెక్ట్కు కథ అందిస్తూ తన సినిమాటిక్ యూనివర్స్ను మరింత విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో రాఘవ లారెన్స్, జయం రవి, నివిన్ పౌలీ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రకటించిన సీక్వెల్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!