
రాజకీయాలు

ఏలూరు జిల్లా వేలేరుపాడులో ఈరోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సావిత్రి, పూలమ్మ అనే ఇద్దరు మహిళలు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు.
స్థానికుల వివరాల ప్రకారం, పూలమ్మ తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నుంచి తన సోదరి వద్దకు వచ్చినట్లు తెలిసింది. మంటల తీవ్రతతో మహిళలు నివసిస్తున్న ఇల్లు పూర్తిగా దగ్ధమవగా, పక్కనే ఉన్న మరో ఇల్లు కూడా అగ్నికి ఆహుతైంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!