

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. అమెరికాకు చెందిన అణు శక్తి గల యుద్ధ విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్తో పాటు యూఎస్ఎస్ ఫ్రాంక్ ఈ. పీటర్సన్ జూనియర్, యూఎస్ఎస్ స్ప్రూయాన్స్ డెస్ట్రాయర్లు, యూఎస్ఎస్ మిషెల్ మార్ఫీ నౌకలు ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ధ్రువీకరించింది. ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకే ఈ సైనిక మోహరింపు చేపట్టినట్లు పేర్కొంది. ఈ నౌకాదళం అరేబియా సముద్రం కాకుండా హిందూ మహాసముద్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో, అమెరికా సైనిక ఉనికి మరింత పెరిగింది.
ఇదిలా ఉండగా, ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆందోళనకారులపై ఇరాన్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడితే జోక్యం చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా పలు ఫైటర్ జెట్లు, మిలిటరీ కార్గో విమానాలను కూడా ఈ ప్రాంతానికి తరలించేందుకు సిద్ధమవుతోందని సమాచారం. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ, ఇరాన్ చర్చలకు సిద్ధమైతే అమెరికా కూడా సంభాషణలకు సిద్ధంగా ఉందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!