
జనరల్

పాఠశాలల పునఃప్రారంభానికి ముందు తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వం ఆమోదించిన ట్యూషన్ ఫీజుల వివరాలను పాఠశాల నోటీస్ బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించింది. తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు, దాచిన ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వం నిర్ణయించిన పరిమితికి మించి ఫీజులు వసూలు చేస్తున్నట్లు తేలితే ఆయా పాఠశాలల గుర్తింపును రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన 13 వేలకుపైగా ప్రైవేట్ పాఠశాలల్లో పారదర్శకత పెంచడం, అనధికారిక ఫీజుల వసూళ్లను అరికట్టడం ఈ చర్య ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!