

తెలంగాణ ఈగల్ ఫోర్స్ అంతర్జాతీయ హైడ్రోపోనిక్ గంజాయి అక్రమ రవాణా ముఠాను ఛేదించింది. థాయ్లాండ్ నుంచి భారత్కు అధిక మత్తు పదార్థ శాతం కలిగిన గంజాయిని అక్రమంగా తరలిస్తున్న భారీ నెట్వర్క్ను గుర్తించింది. ఈ ముఠా సుమారు 300 మంది రవాణాదారులను ఉపయోగించి గంజాయిని దేశంలోకి తీసుకొచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
2026 ఏప్రిల్ 8న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 13.2 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక చర్యల్లో మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని అదనంగా 12.739 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా థాయ్లాండ్, హైదరాబాద్, ముంబై కేంద్రాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ కేసులో మొత్తం 40 మంది నిందితులను గుర్తించారు. 2023 నుంచి ఈ ముఠా ఇతర అక్రమ రవాణా కార్యకలాపాల నుంచి మాదకద్రవ్యాల రవాణాపై దృష్టి సారించినట్లు విచారణలో తేలింది. ముఠా ప్రధాన సూత్రధారిని గుర్తించిన అధికారులు, పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, సంబంధిత సమాచారం ఉంటే 1908 సహాయ సంఖ్యకు తెలియజేయాలని ఈగిల్ ఫోర్స్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!