
జనరల్

ప్రపంచ పర్యావరణ దినోత్సవం రేపు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైకిల్పై ప్రయాణించనున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు కూడా సైకిల్ వినియోగించి మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.
భూమి మన ఇల్లు, ప్రకృతి మన జీవనాధారం అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. సహజ వనరులను కాపాడాలని, గాలి-నీరు-మట్టి కాలుష్యాన్ని తగ్గించాలని కోరారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని సూచించారు. విశాఖ పర్యటనలో తాను సైకిల్పై ప్రయాణించి పర్యావరణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!