
టెక్నాలజీ

వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమల ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 2025 డిసెంబర్ 30 వ తేదీ తెల్లవారుజామున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఈ పవిత్ర ఘట్టానికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. రాత్రి 1:30 గంటల నుంచి ప్రొటోకాల్ వీఐపీలకు దర్శనం కల్పించనున్నారు.
డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, రద్దీ నియంత్రణ, దర్శన ఏర్పాట్లను టీటీడీ మరింత కట్టుదిట్టం చేసింది. ఆధ్యాత్మిక వాతావరణంతో తిరుమల నిండిపోతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!