

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆయన తన X (Twitter) ఖాతా ద్వారా చేసిన పోస్టులో, “అమెరికాను దశాబ్దాలుగా దోచుకున్న అనేక దేశాలు ఇక మినహాయింపు పొందవు. 10% గ్లోబల్ టారిఫ్ను వెంటనే 15% కి పెంచుతున్నాను” అని వెల్లడించారు.
ట్రంప్ పేర్కొన్న ప్రకారం, ఈ నిర్ణయం అమెరికా సుప్రీం కోర్టు ఇటీవల తీసుకున్న టారిఫ్ తీర్పును సమీక్షించిన తరువాత తీసుకున్నదని చెప్పారు. ఆయన దీనిని “తప్పుడు మరియు అమెరికా వ్యతిరేకమైన తీర్పు” గా పేర్కొన్నారు. ఆయన ప్రకటన ప్రకారం, వచ్చే కొన్ని నెలల్లో ట్రంప్ ప్రభుత్వం కొత్తగా అమలు చేయబోయే సుంకాల వివరాలను ప్రకటించనుంది.
“మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్” అనే లక్ష్యంతో, అమెరికా ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయానికి కారణమని ట్రంప్ తెలిపారు. ఈ పెంపు భారతదేశం సహా పలు దేశాల వాణిజ్య వ్యవహారాలపై గణనీయ ప్రభావం చూపనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!