

నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా నక్సలిజంపై కీలక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పుర్లో జరిగిన ఈ సమావేశంలో నక్సల్ వ్యతిరేక చర్యల పురోగతిపై అమిత్షా సమగ్రంగా సమీక్షించారు.
మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని కేంద్రం నిర్దేశించిన గడువు సమీపిస్తుండటంతో ఈ సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాల అధికారులు, ఇంటెలిజెన్స్ విభాగాలు ఈ సమావేశంలో పాల్గొని, ఇప్పటివరకు చేపట్టిన ఆపరేషన్లు, భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు.
నక్సలిజం వ్యతిరేక పోరాటంలో చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అమిత్షా తెలిపారు. గతంతో పోలిస్తే నక్సల్ హింస గణనీయంగా తగ్గిందని, భద్రతా బలగాల సమన్వయంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. నక్సల ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలు మరింత బలోపేతం చేస్తామని, లక్ష్య గడువులోగా నక్సలిజానికి పూర్తిస్థాయి చెక్ పెట్టే దిశగా కేంద్రం కట్టుబడి ఉందని అమిత్షా స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!