
న్యూస్

ధూమపాన రహిత సమాజం లక్ష్యంగా యునైటెడ్ కింగ్డమ్ చారిత్రాత్మక బిల్లును ఆమోదించింది. 2008 డిసెంబరు 31 తర్వాత జన్మించిన వారికి సిగరెట్ల అమ్మకాన్ని ఈ బిల్లు నిషేధిస్తుంది. దీంతో ఇలాంటి చట్టం భారత్లో అమలు చేయడం సాధ్యమేనా అనే చర్చ ప్రారంభమైంది.
అయితే పొగాకు వినియోగంలో భారత్, బ్రిటన్ దేశాల పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. భారత్లో సిగరెట్ వినియోగం తక్కువగా ఉండగా, బీడీలు, పాన్ మసాలా, ఖైనీ వంటి ఉత్పత్తుల వినియోగం ఎక్కువగా ఉంది. మరోవైపు పొగాకు పరిశ్రమ ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం లభిస్తోంది. అందువల్ల ఒకేసారి నిషేధం కాకుండా దశలవారీగా నియంత్రణలు అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!