
న్యూస్

మావోయిస్టుల నిర్మూలనకు గడువు విధించి చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల తీవ్రవాద సమస్యపై దృష్టి సారించింది. 2029 నాటికి ఈశాన్య ప్రాంతాన్ని తీవ్రవాద రహిత ప్రాంతంగా మార్చాలని కేంద్ర హోంశాఖ సంకల్పించింది. ఇందులో భాగంగా ముందుగా మణిపూర్ పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
ఈ చర్యల కోసం కేంద్ర సాయుధ పోలీసు బలగాలను వినియోగించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన బలగాల్లో కొంతమందిని ఈశాన్య రాష్ట్రాలకు తరలించే అవకాశం ఉంది. మణిపూర్తో పాటు అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో తీవ్రవాద వ్యతిరేక చర్యలను మరింత వేగవంతం చేయనున్నారు. ఈశాన్య ప్రాంతంలో మొత్తం 16 తీవ్రవాద సంస్థలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!