
న్యూస్

గ్యాస్ సిలిండర్ల సరఫరా గురించి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఈ లేఖలో భాగంగా ఈ నెల 23 వ తేదీ నుంచి రాష్ట్రాలకు అదనపు గ్యాస్ సిలిండర్లు పంపించనున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే వలస కూలీలకు సహాయంగా ఉచితంగా ఐదు కిలోల గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది.
అదే సమయంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాను 20 శాతం పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు వంటి చోట్ల గ్యాస్ కొరత రాకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం తెలిపింది. పరిశ్రమలు మరియు కార్యాలయాల్లో ఉన్న క్యాంటీన్లకు కూడా గ్యాస్ సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలని సూచించింది.







.webp&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!