

దేశంలో ప్రముఖ లగ్జరీ బ్యూటీ క్లినిక్లలో ఒకటైన హివాగ లగ్జరీ బ్యూటీ క్లినిక్ కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడు సంవత్సరాల క్రితం హైదరాబాద్లో గచ్చిబౌలిలో మొదటి బ్రాంచ్ ప్రారంభమైంది. ఇప్పుడు కొంపల్లిలో ప్రారంభమైన ఈ బ్రాంచ్ హైదరాబాద్లో రెండోది కాగా, దేశవ్యాప్తంగా ఎనిమిదో బ్రాంచ్ కావడం విశేషం. ఈ క్లినిక్కు హరిత రెడ్డి సతి సీఈఓగా, రామ్ మోహన్ రెడ్డి సతి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.
ఈ క్లినిక్లో పురుషులు, మహిళలకు ఆధునిక స్కిన్ మరియు హెయిర్ ట్రీట్మెంట్స్తో పాటు సెలూన్ సేవలు అందించనున్నారు. నిపుణులైన డెర్మటాలజిస్టుల పర్యవేక్షణలో అన్ని చికిత్సలు అందుబాటులో ఉంటాయి. ప్రారంభోత్సవం సందర్భంగా సీఈఓ హరిత రెడ్డి సతి మాట్లాడుతూ, హైదరాబాద్లో రెండో బ్రాంచ్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇది తమపై మరింత బాధ్యతను పెంచిందని, తమ క్లినిక్లో అందించే ట్రీట్మెంట్స్ ఫలితాల విషయంలో కస్టమర్లు నమ్మకంగా ఉండవచ్చని చెప్పారు.

పర్మినెంట్ మేకప్, బ్రైడల్ మేకప్, పర్మినెంట్ హెయిర్ రిమూవల్ వంటి అనేక సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించామని, మధ్య తరగతి వారికి కూడా అందుబాటు ధరల్లో సేవలు అందిస్తున్నామని చెప్పారు. ట్రీట్మెంట్ ప్రారంభానికి ముందు హెల్త్ కౌన్సెలింగ్ కూడా ఇస్తారని తెలిపారు. తమ ప్రయాణం విశాఖపట్నం నుంచి ప్రారంభమైందని, త్వరలో తిరుపతి, భీమవరం, కాకినాడలో కూడా కొత్త బ్రాంచ్లు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రతి చోట స్థానిక ప్రజలు ఇచ్చిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!