

ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్యూఎల్) ముడి సరకు మరియు ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడంతో సబ్బుల ధరలను పెంచింది. లిరిల్, పియర్స్, డవ్ వంటి ప్రముఖ బ్రాండ్ల ధరలు 100 గ్రాములకు రూ.2–3 వరకు పెరిగాయి. దీంతో లిరిల్ రూ.41, పియర్స్ రూ.42, డవ్ సీరమ్ సబ్బు రూ.60, డవ్ పింక్ సబ్బు రూ.70కు చేరాయి. సర్ఫ్, రెడ్ లేబుల్ వంటి ఇతర ఉత్పత్తుల ధరలపై కూడా ప్రభావం పడింది.
ఈ ధరల పెంపుకు ప్రధాన కారణంగా పామ్ ఫ్యాటీ యాసిడ్ డిస్టిలేట్ (పీఎఫ్ఏడీ) వంటి కీలక ముడి పదార్థాల ధరల పెరుగుదల, సరఫరా లోపాలు, రవాణా మరియు ఇంధన ఖర్చుల పెరుగుదలని కంపెనీ పేర్కొంది. పామాయిల్, క్రూడ్ ఆయిల్ ధరల మార్పులు, పశ్చిమాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు కూడా ఖర్చులను పెంచాయి. అయినప్పటికీ వినియోగదారులపై అధిక భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఎంపిక చేసిన ఉత్పత్తులపై మాత్రమే ధరలు పెంచినట్లు హెచ్యూఎల్ వెల్లడించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!