

సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన బస్సు అగ్నిప్రమాదం హైదరాబాద్లోని అనేక కుటుంబాలను శోకసముద్రంలో ముంచేసింది. ఉమ్రా యాత్ర నిర్వహించుకొని తిరిగి మదీనాకు వస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటుచేసుకుని, మొత్తం 45 మంది భారతీయులు అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ఉండటం మరింత విషాదం. వారిలో తొమ్మిది మంది పెద్దలు, తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. రామ్నగర్కు చెందిన నసీరుద్దీన్ కుటుంబం నుండి ముగ్గురు తరాలకు చెందిన 18 మంది ఈ బోర్డులో ఉన్నారు. వారు వచ్చే శనివారం హైదరాబాద్కు చేరుకునే ఉద్దేశ్యంతో ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడే ప్రమాదం సంభవించింది.
అగ్నికి ఆహుతైన మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నందున, అధికారలు డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తింపు ప్రక్రియను చేపట్టారు. మృతుల అంత్యక్రియలు మదీనాలోని శ్మశానంలోనే నిర్వహించాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా కేసుపై పూర్తి దృష్టి పెట్టింది. మంత్రి అజారుద్దీన్, నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్లతో కూడిన బృందం సౌదీకి వెళ్లి స్థానిక అధికారులతో సమన్వయం కొనసాగిస్తోంది. అంత్యక్రియలు పూర్తయ్యేవరకు వారు అక్కడే ఉంటారు. టోలిచౌకీ, నటరాజ్నగర్, జిర్రా ప్రాంతాల్లో బాధితుల ఇళ్ల వద్ద విషాదం ఆవహించింది. జీవితంలో ఎన్నో కలలతో బయల్దేరిన యాత్ర చివరకు విషాదయాత్రగా మారడం అందరినీ కలచివేస్తోంది.











కామెంట్స్ (1)
మదీనా బస్సు ప్రమాదం వార్త హృదయాన్ని ఛేదిస్తోంది