

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం అర్ధరాత్రితో ముగియనున్నాయి. గత తొమ్మిది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం లక్షలాది భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని కల్పించింది. ఈ రోజు రాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను మూసివేస్తామని టీటీడి అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు.
టీటీడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, వైకుంఠ ద్వారాల మూసివేత అనంతరం ఆలయంలో సాధారణ దర్శన విధానం అమల్లోకి వస్తుంది. అలాగే, రోజువారీ ఆరాధన సేవలు సాధారణ క్రమంలో కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 20 వ తేదీ నుంచి 29 వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించగా, ఈ కాలంలో 7 లక్షల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారని వెల్లడించారు. ఈ ఏడాది నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనాలు రికార్డు స్థాయిలో సాగినట్లు టీటీడి అధికారులు పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!