
గాసిప్స్

TG : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సిట్ దర్యాప్తు అధికారి ముందు తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు స్పష్టంగా పేర్కొంది.
టీజీ ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టోడియల్ దర్యాప్తు నిర్వహించేందుకు సిట్కు అనుమతి ఇవ్వాలని జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించింది. అలాగే, ప్రభాకర్రావుకు ఎలాంటి భౌతిక హాని జరగకుండా పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!