
సినిమాలు

విజయవాడలో నిర్వహించిన ‘పెద్ది’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెల్లుబాటు అయ్యే పాస్లు ఉన్నప్పటికీ తమను లోపలికి అనుమతించలేదని పలువురు అభిమానులు ఆరోపించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ముందుగానే వేదిక వద్దకు చేరుకున్నారు.
స్టేడియం సామర్థ్యం పూర్తిగా నిండిపోయిందని చెబుతూ పోలీసులు సాయంత్రం 5:30 గంటలకే ప్రవేశ ద్వారాలను మూసివేసినట్లు సమాచారం. తిరుపతి, నెల్లూరు తదితర జిల్లాల నుంచి సెలబ్రిటీ పాస్లతో వచ్చిన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాస్లు ఇచ్చి ఎందుకు అనుమతించడం లేదంటూ అభిమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!