
బిజినెస్

తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యా విధానంలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకూ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు ఈ పరీక్షలు కేవలం సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే ఉండేవి.అదనంగా, ప్రతి సబ్జెక్ట్లో 80 శాతం మార్కులు రాత పరీక్షలకూ, 20 శాతం మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్కూ కేటాయించాలని నిర్ణయించారు. విద్యార్థుల ప్రాక్టికల్ అవగాహన పెంచేందుకు ఈ మార్పులు తీసుకురావాలని బోర్డు పేర్కొంది.అంతేకాక, కొత్త విద్యాసంవత్సరం నుంచి ACE (Accountancy, Commerce, Economics) పేరుతో కొత్త గ్రూప్ను కూడా ప్రవేశపెట్టనున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!