
సినిమాలు

ఓలా సంస్థకు వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. వాహనంలో లోపాలు ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిషన్, ఫిర్యాదుదారుడి వాదనలు పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది.
నల్లగండ్లకు చెందిన సంతోష్ రెడ్డి 2023 నవంబర్ 9న ఓలా వాహనం కొనుగోలు చేశారు. అయితే వాహనంలో తరచూ సమస్యలు తలెత్తడంతో సర్వీస్ సెంటర్ను ఆశ్రయించినప్పటికీ పరిష్కారం కాలేదని ఆయన తెలిపారు. దీంతో వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. కేసు విచారణ అనంతరం కమిషన్, వాహనం ధర రూ.1,19,999, ఇన్సూరెన్స్ రూ.7,243, కేసు ఖర్చుల కింద రూ.5,000, అదనంగా పరిహారంగా మరో రూ.5,000 బాధితుడికి చెల్లించాలని ఓలా సంస్థను ఆదేశించింది.



.png&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!