

బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) ఛైర్మన్ తారిక్ రహ్మాన్ త్వరలో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఫిబ్రవరి 17న జరగనున్న ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు విదేశీ నాయకులకు ఆహ్వానాలు పంపినట్లు సమాచారం.
బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సలహాదారు ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్, ప్రధాని మోదీ సహా మొత్తం 13 దేశాధినేతలను ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. బీఎన్పీ విజయం అనంతరం తారిక్ రహ్మాన్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది.
అయితే, అదే రోజు ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి ప్రధాని మోదీ ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో ఆయన వ్యక్తిగతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానికి బదులుగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ లేదా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!