

శీతాకాలపు దట్టమైన పొగమంచు ఉత్తర భారతదేశంలో ఈ ఏడాదీ ప్రభావం చూపుతోంది. ఆదివారం ఉదయం ఆగ్రా నగరాన్ని కప్పిన పొగమంచు కారణంగా, ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్ పూర్తిగా కనిపించలేకపోయింది. తాజ్ వ్యూ పాయింట్ నుండి కూడా ఈ ఐకానిక్ స్మారకం అస్పష్టంగా, దాదాపు అదృశ్యమైనట్టుగా కనిపించింది.
ఆగ్రా, అయోధ్య, మొరాదాబాద్ వంటి నగరాల్లోనూ గాలిలో దట్టమైన పొగమంచు కొనసాగుతోంది. అయోధ్యలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్గా, మొరాదాబాద్లో 10 డిగ్రీలుగా నమోదయింది. జాతీయ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఉదయం 7 గంటలకి ఏర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 390కు చేరుకుని 'వెరీ పూర్' స్థాయిలో ఉంది.
అక్షర్ధామ్, ఘాజీపూర్, ఆనంద్ విహార్ వంటి ప్రాంతాల్లో AQI 438కి చేరి 'సివియర్' స్థాయికి పెరిగింది. దీనివల్ల GRAP స్టేజ్-4 నిబంధనలు అమల్లోకి వచ్చాయి. నాన్ - ఎసెన్షియల్ నిర్మాణాలపై నిషేధాలు, కొన్ని డీజిల్ వాహనాలపై ఆంక్షలు విధించబడ్డాయి. పొగమంచు కారణంగా యాత్రికులు, పర్యాటకులు నిరాశ చెందుతూ, సోషల్ మీడియాలో ‘తాజ్మహల్ లేదా ఫాగ్ మహల్?’ అనే మీమ్స్ వైరలవుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!