

దశాబ్దాల పాటు నిషేధిత సిపిఐ (మావోయిస్టు) పార్టీలో అజ్ఞాత జీవితం గడిపిన 41 మంది మావోయిస్టు కేడర్లు తెలంగాణ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) సమక్షంలో జన జీవన స్రవంతిలో కలిశారు. వీరిలో PLGA బెటాలియన్కు చెందిన కంపెనీ ప్లాటూన్ కమిటీ సభ్యులు (CyPCMs), డివిజనల్ కమిటీ సభ్యులు (DVCMs) వంటి కీలక స్థాయి నాయకులు కూడా ఉన్నారు.
లొంగిపోయిన కేడర్లు తమ వద్ద ఉన్న మొత్తం 24 ఆయుధాలను కూడా పోలీసులకు అప్పగించారు. వీటిలో
1 INSAAS LMG
3 AK-47 తుపాకులు
5 SLR రైఫిళ్లు
7 INSAAS రైఫిళ్లు
1 BGL గన్
4 .303 రైఫిళ్లు
1 సింగిల్ షాట్ రైఫిల్
2 ఎయిర్ గన్స్
ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అజ్ఞాత జీవితం వదిలి ఇంత పెద్ద సంఖ్యలో కేడర్లు ఆయుధాలతో సహా లొంగిపోవడం సిపిఐ (మావోయిస్టు) పార్టీకే కాకుండా వారి సాయుధ విభాగానికి కూడా తీవ్రమైన ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. అధికారుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిణామం మావోయిస్టు పార్టీలో రోజు రోజుకు పెరుగుతున్న సంస్థాగత వైఫల్యం, క్యాడర్లలో మనోధైర్యం తగ్గుదల, అలాగే నాయకత్వం పై విశ్వాసం కోల్పోవడం వంటి అంశాలను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ప్రభుత్వ పునరావాస విధానాలు, పోలీసుల సమర్థ చర్యల కారణంగా మావోయిస్టు కేడర్లు జన జీవన స్రవంతిలోకి రావడానికి ముందుకొస్తున్నారని అధికారులు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!