
న్యూస్

లార్క్ స్టూడియోస్, ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ సంయుక్తంగా కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించాయి. ఈ సినిమాలో జి.వి. ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. కరుడన్, మామన్ చిత్రాల విజయాల తర్వాత లార్క్ స్టూడియోస్ నిర్మిస్తున్న మూడో చిత్రం ఇదే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, ఈ చిత్రం జూన్లో ప్రారంభం కానుంది.
‘జో’ సినిమాతో మంచి గుర్తింపు పొందిన హరిహరన్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రంలో నటించడమే కాకుండా సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన కొత్తగా కనిపించనున్నారు. ‘జో’ చిత్రంలో ఆకట్టుకున్న మాలవిక మనోజ్ హీరోయిన్గా నటిస్తుండగా, సినిమాటోగ్రఫీని తేని ఈశ్వర్ నిర్వహిస్తున్నారు. మిగతా తారాగణం వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.















.jpg&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!