
గాసిప్స్

లూలూ మాల్లో హీరోయిన్ నిధి అగర్వాల్కు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ‘రాజాసాబ్’ సినిమాలోని రెండో పాట విడుదల కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కొందరు దురభిమానులు గుమిగూడి ఆమెను ఇబ్బందులకు గురిచేయడంతో సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఘటనపై కూకట్పల్లి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈవెంట్ నిర్వహణకు ఎటువంటి అనుమతులు తీసుకోలేదని పోలీసులు వెల్లడించారు. నిర్వాహకులతో పాటు లూలూ మాల్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!