

పార్సిల్ బుకింగ్ కోసం క్యూలలో నిలబడటం, ఫారాలు నింపడం, కార్యాలయాల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులకు ముగింపు పలుకుతూ దక్షిణ భారత రైల్వే ‘రైల్ పార్సిల్ యాప్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బుధవారం రైల్వే నిలయంలో జోన్ జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ ఈ యాప్ను ఆవిష్కరించారు. భారతీయ రైల్వేలో ఇదే తొలి సమగ్ర డిజిటల్ పార్సిల్ లాజిస్టిక్స్ అప్లికేషన్గా అధికారులు పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా టాక్సీ బుక్ చేసినంత సులభంగా పార్సిల్ సేవలను బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
ఈ యాప్ సహాయంతో ఇంటి నుంచే పార్సిల్ బుకింగ్ మరియు డెలివరీ సదుపాయం పొందవచ్చని అధికారులు వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాల్లో సేవలను ప్రారంభించారు. అలాగే, ఫ్రైట్ లాజిస్టిక్స్ మార్కెట్పై అధ్యయనం కోసం ఐఐఎం బెంగళూరుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. 2030 నాటికి 3,000 మిలియన్ టన్నుల సరకు రవాణా లక్ష్య సాధనకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని జీఎం పేర్కొన్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!