
బిజినెస్

తిరుమల లడ్డూ వివాదం తాజాగా సుప్రీంకోర్టు దాకా చేరింది. ఈ అంశం పై బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం సిట్ నివేదిక పై ఏకసభ్య కమిటీ నియమించడాన్ని ఆయన సవాల్ చేశారు. ఈ నిర్ణయం చట్టబద్ధత పై సందేహాలు ఉన్నాయని పేర్కొంటూ కోర్టు జోక్యం కోరారు.
ఈ పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది. విచారణలో ప్రభుత్వం మరియు పిటిషనర్ వాదనలు వినిపించే అవకాశం ఉంది.
తిరుమల లడ్డూ అంశం ఇప్పటికే రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, సుప్రీంకోర్టు విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!