

ఎర్రకోట పేలుడు కేసులో జాతీయ దర్యాఫ్తు సంస్థ (NIA) మరో పెద్ద విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్-ఉన్-నబి, ఎర్రకోట పార్కింగ్ లాట్లో నిలిపిన కారులోనే బాంబును తయారు చేశాడన్న విషయం బయటపడింది. ఈ నిజం దర్యాప్తు అధికారులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
NIA వెల్లడించిన వివరాల ప్రకారం, ఉమర్ తన కారులో కూర్చుని మూడు గంటల పాటు పేలుడు పదార్థాలను అసెంబిల్ చేసినట్టు సీసీటీవీ ఆధారాలు చూపుతున్నాయి. ఆ సమయంలో ఒక్కసారైనా కారు నుంచి బయటకు రాలేదని కూడా స్పష్టమైంది. అంటే దాడికి అవసరమైన మొత్తం పేలుడు పరికరాలు పార్కింగ్లోనే సిద్ధం చేసినట్టు తేలింది.
ఇదే సమయంలో, దాడికి ముందే ఉమర్ బాంబింగ్ స్థలమైన ఎర్రకోట పరిసరాల్లో సర్వే చేసినట్టు కూడా మరిన్ని వీడియో ఆధారాలు దొరికాయి. ముందుగా ఢిల్లీలో ఏ ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకోవాలో తన సహచరులతో ఉమర్ చాలాసేపు చర్చించినట్టు అధికారులు తెలిపారు. చివరకు అత్యంత రద్దీగా ఉండే నేతాజీ సుభాష్ మార్గ్ను టార్గెట్గా ఎంచుకుని ఉంటారని దర్యాప్తు సంస్థ భావిస్తోంది.
తాజాగా ఫరీదాబాద్లో ఉగ్ర మాడ్యూల్ బయట పడటం, తన అరెస్ట్ ఎప్పుడైనా జరుగుతుందన్న భయం ఉమర్లో ఉండడంతోనే త్వరగా పేలుడు జరగాలని తొందరపడ్డాడని NIA అనుమానం వ్యక్తం చేస్తోంది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!