
జనరల్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో రేపు సికింద్రాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. వేడుకల నిర్వహణ కారణంగా వాహనాల రాకపోకలను నియంత్రించనున్నట్లు పేర్కొన్నారు.
బేగంపేట, సంగీత్ జంక్షన్, తిరుమలగిరి, బోయిన్పల్లి మార్గాల్లో వాహనాల మళ్లింపులు చేపట్టనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు. వేడుకల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!