
బిజినెస్

దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో బీటెక్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. పరీక్ష నిర్వహించిన ఐఐటీ రూర్కీ షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్సైట్లో ఫలితాలు, ర్యాంకులను ప్రకటించనుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 1.90 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు అంచనా వేస్తున్నారు.
ఫలితాల ప్రకటన అనంతరం ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ వేగం పుంజుకోనుంది. జూన్ 2 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభం కానుండగా, ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎస్పీఏలు మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాసంస్థలలో సీట్ల కేటాయింపు మెరిట్ ఆధారంగా జరగనుంది. ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!