

తెలంగాణలో జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ), మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ) ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం సాయంత్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొననుంది.
గత డిసెంబర్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పూర్తికాగా, అనంతరం మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించారు. తాజాగా ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్న మండల, జిల్లా ప్రజాపరిషత్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేసింది. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలోనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి మినహా మిగిలిన అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 2025 జూలై 10 నుంచి 2026 ఫిబ్రవరి 5 వరకు సమీకరించిన ఓటర్ల జాబితా ఆధారంగా ఈ ప్రక్రియ కొనసాగనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!