

ఇరాన్తో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కౌంటర్ టెర్రరిజం చీఫ్గా పనిచేస్తున్న జో కెంట్ తన పదవికి రాజీనామా చేశారు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధాన్ని తాను సమర్థించలేనని, తన అంతరాత్మ దీనికి ఒప్పుకోవడం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇరాన్ నుంచి అమెరికాకు తక్షణ ముప్పు లేదని, అందువల్ల ఈ యుద్ధం అవసరం లేదని కూడా అన్నారు.
కెంట్ ప్రకారం, ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే అమెరికా ఇరాన్పై దాడులకు దిగిందని చెప్పారు. అమెరికాలో ఇజ్రాయెల్కు పెద్ద లాబీయింగ్ ప్రభావం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే విదేశాంగ విషయాల్లో ఇప్పటివరకు ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలకు తాను మద్దతు ఇస్తానని చెప్పారు.
రాజీనామా లేఖలో కెంట్ ట్రంప్కు కొన్ని సూచనలు కూడా చేశారు. గత ఎన్నికల ప్రచారాల్లో ట్రంప్ చెప్పిన విలువలకు తాను మద్దతుగా ఉన్నానని తెలిపారు. ట్రంప్ మొదటి పాలనలో ఇతర అధ్యక్షుల కంటే జాగ్రత్తగా వ్యవహరించి, అమెరికా సైన్యాన్ని పెద్ద యుద్ధాల్లోకి పంపలేదని చెప్పారు. కానీ రెండోసారి ఎన్నికైన తర్వాత ఇజ్రాయెల్ ప్రభావంతో ఇరాన్ను ముప్పుగా భావించి ఈ యుద్ధం ప్రారంభమైందని ఆయన వ్యాఖ్యానించారు. వేలాది మంది అమెరికా సైనికుల ప్రాణాలు ప్రమాదంలో పడకుండా పరిస్థితిని సరిదిద్దాలని కెంట్ తన లేఖలో కోరారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!