

యాక్షన్ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ మరో భారీ యాక్షన్ ప్రాజెక్ట్కు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ‘భరతవర్ష’ సినిమాతో బిజీగా ఉన్న ఆయన, ఇప్పుడు స్టంట్ మాస్టర్ వెంకట్ దర్శకత్వంలో కొత్త యాక్షన్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. యాక్షన్ సన్నివేశాల్లో అనుభవం ఉన్న వెంకట్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందనుందని టాక్ వినిపిస్తోంది.
70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించనున్నారు. రేపు హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని సమాచారం. బలమైన సాంకేతిక బృందంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గోపీచంద్ అభిమానులు ఈ ప్రాజెక్ట్ నుంచి పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ను ఆశిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!